ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Comments · 9 Views

పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవ

పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవరి 2025న ప్రారంభమై అలాగే ఏప్రిల్ 4న ముగుస్తాయి. ముఖ్యంగా బడ్జెట్ FY26 ప్రకటన ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు సెషన్లుగా నివహించనున్నారు. మొదటి సెషన్ జనవరి 31న ప్రారంభమై 13 ఫిబ్రవరి 2025న వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుంది. రెండవ సెషన్ మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 31 జనవరి 2025న న్యూఢిల్లీలో ఉదయం 11:00 గంటలకు లోక్‌సభ ఛాంబర్‌లో పార్లమెంట్ సమావేశంలో ప్రసంగిస్తారు. దీని తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన దేశంలో ఆర్థిక మంత్రిగా తన ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె ఆరు అన్యువల్ బడ్జెట్‌లు ఇంకా రెండు ఇంటర్మ్ బడ్జెట్‌లను సమర్పించారు, దింతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించారు.
మరో బలమైన ఆర్‌బిఐ డివిడెండ్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మద్దతునిస్తుందని మా విశ్లేషణ సూచిస్తుంది. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ఇంకా దీర్ఘకాలిక నిర్మాణ మార్పుల ద్వారా వృద్ధిని పెంచడంపై దృష్టి పెట్టాలి. ప్రయివేటు పెట్టుబడులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టిని కొనసాగించే అవకాశం ఉంది.

Comments

BuzzingAbout